రాముడి ‘దర్బార్’ పనులు వెంటనే ప్రారంభిస్తాం : రామాలయం ట్రస్ట్

by Dishanational4 |
రాముడి ‘దర్బార్’ పనులు వెంటనే ప్రారంభిస్తాం : రామాలయం ట్రస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరంలో మిగిలిన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తామని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఆలయంలోని మొదటి అంతస్తులో నిర్మించబోయే శ్రీరాముడి దర్బార్​ సహా రెండో అంతస్తు పనులు వెంటనే ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. ఆలయం పార్కోట, 795 మీటర్ల పరిక్రమ గోడ వంటి పనులను పూర్తి చేయాల్సి ఉందన్నారు. శనివారం జరిగిన రామమందిర కమిటీ సమావేశంలో ఈ అంశాలపై చర్చించామని నృపేంద్ర మిశ్రా పేర్కొన్నారు. అయోధ్య రాముడి దర్శనానికి వస్తున్న భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై తమ ప్రధాన ఫోకస్ ఉంటుందన్నారు.

Next Story

Most Viewed