అయోధ్యకు వెళ్లే టూరిస్టులకు గుడ్ న్యూస్

by Dishanational2 |
అయోధ్యకు వెళ్లే టూరిస్టులకు గుడ్ న్యూస్
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలోని రామమందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ట వేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ ఆదివారం అయోధ్యలో 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. అయోధ్య నగరంలో పర్యాటకులకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈ బస్సులు రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. సీఎం యోగీ చొరవతో ఈ బస్సులు నగరానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. జనవరి 22న అయోధ్యకు వచ్చే ప్రతినిధులందరికీ ఈ బస్సు సేవలు అందిస్తామని చెప్పారు. వీటిని నడపడానికి డ్రైవర్లకు సైతం ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యాన్ని విడుదల చేయవు. అయోధ్య ఈవెంట్ సందర్భంగా సందర్శకులను ఆకర్షించేందుకు వీటిని ప్రత్యేకంగా అలంకరించారు.

Next Story

Most Viewed