90 శాతం ముస్లీం ఉన్న దేశంలో ప్రతీ రోజూ రామయణం చదువుతారని తెలుసా?

by Disha Web Desk 8 |
90 శాతం ముస్లీం ఉన్న దేశంలో ప్రతీ రోజూ రామయణం చదువుతారని తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : అయోధ్యలో జనవరి 22న రామప్రాణ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం రాముడి భక్తులందరూ వేల కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎవరినోట విన్నా ఆ శ్రీరాముని పేరే వినిపిస్తుంది. అంతే కాకుండా చాలా మంది రామాయణం చదువుతున్నారు.

అయితే ఒక హిందూ దేశమైన మన భారత దేశంలో రాయాణం రోజూ చదివేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ 90 శాతం ముస్లీం జనాభా ఉన్న దేశంలో ఈ రోజుకి కూడా రామున్ని పూజిస్తారంట. అలాగే అక్కడ రామ్‌లీల పాటించడం, ప్రతీ ఇంట్లో రామాయణం తప్పకుండా ఉంటుందంట. అంతేకాకుండా అక్కడి వారు హనుమాన్‌కి వీరభక్తులంట.ఇంతకీ అది ఎక్కడ అనుకుంటున్నారా? మన పక్కనే ఉన్న ఇండోనేషియా,అక్కడ చాలా ఎక్కువ మంది ముస్లీలు ఉన్నప్పటికీ అక్కడ ఎక్కువ పూజించే గ్రంథం రామాయణం. అక్కడి వారు రామున్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారంట. అంతే కాకుండా ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవం డిసెంబర్ 27న ప్రతీ ఒక్కరు హనుమాన్ వేషాధరణలో వచ్చి ఊరేగింపులు చేస్తారంట. అంటే అక్కడ హనుమంతునికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Next Story

Most Viewed