ఎయిర్‌పోర్టు‌కు వచ్చిన అయోధ్య రాముడు.. రంగోళితో మాయ చేసిన యువతి (వీడియో వైరల్)

by Disha Web Desk 1 |
ఎయిర్‌పోర్టు‌కు వచ్చిన అయోధ్య రాముడు.. రంగోళితో మాయ చేసిన యువతి (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో 500 ఏళ్ల తరువాత హిందువుల చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం కల సాకారమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా.. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం అయోధ్యకు లక్షల్లో తరలి వస్తున్నారు.

ఈ క్రమంలోనే రామ్‌లల్లాపై భక్తిని చాటుతూ కొందరు కళాకారులు తమ సత్తాను చాటుతున్నారు. తాజాగా ఓ యువతి అయోధ్య ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో అద్భుతం చేసింది. ఏకంగా అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసిన రామ్‌లల్లాను రంగోళితో చితీకరించింది. దీంతో ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికులు రాముడి చిత్రాన్ని చూసి మగ్ధమనోహరంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఓ నెటిజన్ ఆ చిత్రాన్ని చూసి సెల్‌ఫోన్లలో బంధించి ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed