అయోధ్య రామమందిరం ప్రారంభం వేళ షాకింగ్ ఇన్సిడెంట్ (వీడియో)

by Disha Web Desk 2 |
అయోధ్య రామమందిరం ప్రారంభం వేళ షాకింగ్ ఇన్సిడెంట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రామ భక్తులు చర్చిపై కాషాయ జెండా ఎగురవేశారు. తాజాగా.. దీనిపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్‌)లో పోస్టు పెట్టారు. ‘హే రామ్ మన దేశంలో ఇలాంటి ఘటనలు ఇక సర్వసాధారణం అయిపోయాయా’ అని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకున్నదనేది తెలియాల్సి ఉంది. రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ అయోధ్యకు చేరుకున్నారు. సరిగ్గా 12:29 నిమిషాలకు రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.




Next Story

Most Viewed