ఇండియా ఫ్రీడమ్ ఆన్ లీజ్.. అంటే ఇండియన్స్ ఇంగ్లండ్ సిటిజన్స్ అయిపోతారా?

by  |
99-Year Lease
X

దిశ, ఫీచర్స్ : ఇండియన్ సిటిజన్స్.. ఇంగ్లాండ్ సిటిజన్స్‌గా మారిపోనున్నారా? మరి కొన్ని సంవత్సరాల్లో ఇండియా ఫ్రీడమ్‌ను కోల్పోతుందా?.. బీజేపీ యువ నాయకురాలు చేసే వాదన, చెప్పే మాటలు అలాగే ఉన్నాయి మరి. భారతీయ జనతా యువ మోర్చా స్పోక్స్‌పర్సన్ రుచి పఠాక్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్‌కు సంబంధించిన డిస్కషన్‌లో ఇలాంటి కామెంట్స్ చేసింది. బ్రిటిష్ చక్రవర్తి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ‘99-ఏళ్ల లీజ్’కు ఇచ్చాడని, నిజానికి ఇండియా కంప్లీట్ ఫ్రీడమ్ కంట్రీ కాదని చెప్పింది. అంతేకాదు ఎలాంటి సంకోచం లేకుండా పూర్తి కాన్ఫిడెన్స్‌తో దీనిపై వివరణ కూడా ఇచ్చింది.

దీంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే 99 ఇయర్స్ ఎక్స్‌పైర్ అయితే ఇండియన్స్ ఇంగ్లాండ్ సిటిజెన్స్ అయిపోతారా అని మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. మోడీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ చూసి 99 ఏళ్లకు ముందే బ్రిటిషర్స్ మళ్లీ ఇండియాకు వచ్చిన ఆశ్చర్యం లేదని సెటైర్స్ వేస్తున్నారు. ‘మా ప్రాపర్టీ అమ్మడం మానేయండి మోడీజీ అని బ్రిటిష్ రాణి హెచ్చరిక జారీ చేస్తుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు.


Next Story

Most Viewed