దేశంలో కొత్తగా 9121 కరోనా కేసులు

by  |
దేశంలో కొత్తగా 9121 కరోనా కేసులు
X

దిశ,వెబ్‌డెస్క్: గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9,121 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,25,710కు చేరింది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 81 మంది మరణించారు. కాగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,55,813 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,36,872 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 11,805 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యాధికారులు తెలిపారు.



Next Story

Most Viewed