మునుగోడులో 91 కరోనా కేసులు

by  |
మునుగోడులో 91 కరోనా కేసులు
X

దిశ, మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా చేసిన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో 105 మందికి కరోనా పరీక్షలు చేయగా 29 మందికి, సంస్థాన్ నారాయణపురంలో 28 మంది పరీక్షలు చేయగా ఆరుగురికి, మునుగోడులో 65 మందికి పరీక్షలు చేయగా 12 మందికి, చండూరులో 50 మందికి పరీక్షలు చేయగా 21 మందికి, నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 70 మందికి పరీక్షలు చేయగా 9 మందికి, మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 65 మంది పరీక్షలు చేయగా 12మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్ట వైద్యాధికారులు వెల్లడించారు. బాధిత వ్యక్తులను హోం ఐసొలేషన్‌లో ఉంచి కరోనా మెడికల్ కిట్లను అందజేసినట్టు అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed