పెండ్లి బస్సుపై పడ్డ కరెంట్ తీగలు.. 9మంది దుర్మరణం

by  |
పెండ్లి బస్సుపై పడ్డ కరెంట్ తీగలు.. 9మంది దుర్మరణం
X

ఒడిస్సాలోని గంజాం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. పెండ్లికి వెళ్తున్నవారి బస్సుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో షాక్‌కు గురై.. బస్సులోని తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 20మందికి పైగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై, కరెంట్ సరఫరా నిలిపివేయడంతో కొంతవరకు ప్రాణనష్టం తగ్గింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉండటం స్థానికులకు కలచివేసింది.

Next Story

Most Viewed