తెలంగాణలో కరోనా విలయతాండవం

by  |
తెలంగాణలో కరోనా విలయతాండవం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గడిచిన 24గంటల్లో 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఏడుగురు చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 713 పాజిటివ్ కేసులు ఉన్నాయి. రంగారెడ్డి 107, మేడ్చల్ 16, మంచిర్యాల 5, సంగారెడ్డి 12, వరంగల్ రూరల్ 6, వరంగల్ అర్బన్ 1, జనగామ కరీంనగర్, మహబూబాబాద్‌లో రెండేసి కేసులు, కామరెడ్డి మెదక్‌లో మూడు చొప్పున కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,674 కేసులు నమోదు కాగా కరోనాతో ఇప్పటివరకు మొత్తం 217మంది మరణించారు. యాక్టివ్ కేసులు 4,452 ఉండగా, కోలుకొని 4,005 మంది డిశ్చార్జ్ అయ్యారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed