- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంజాబ్లో 86 మంది మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 86కు చేరింది. శనివారం తార్న్ తరన్ లో మరో 44, బాటాల జిల్లాలో ఇద్దరు, అమృత్ సర్ లో ఒకరు తాజాగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 86 కు చేరుకుంది. అయితే, ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం.. ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 86కు చేరింది. శనివారం తార్న్ తరన్ లో మరో 44, బాటాల జిల్లాలో ఇద్దరు, అమృత్ సర్ లో ఒకరు తాజాగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 86 కు చేరుకుంది.
అయితే, ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం.. ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు. అయితే, ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి 10 మంది నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తార్న్ తరన్ లో 19, బాటాల జిల్లాలో 9 మంది, అమృత్ సర్ లో 11 మంది ఇంతముందుకే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Next Story






