దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

by  |
carona 1
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. వరసగా ఐదోరోజు లక్షకు దిగువనే కేసులు నమోదయ్యాయి. శనివారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 84,332 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,59,155కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 4,002 మంది మరణించారు. అదే సమయంలో 1,21,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,67,018కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 24.96 కోట్లమందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు.


Next Story

Most Viewed