శుభవార్త.. ఇవాళ్టి నుంచి మీకు రూ. 24 వేలు ఇస్తరంట!

by  |
శుభవార్త.. ఇవాళ్టి నుంచి మీకు రూ. 24 వేలు ఇస్తరంట!
X

దిశ, వెబ్ డెస్క్: ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ రెండో విడత కార్యక్రమాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ. 24 వేలు నగదు పంపిణీ చేయనున్నారు. మొత్తం 81024 మంది చేనేతలకు లబ్ధి చేకూరనుంది. ఉదయం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేయనున్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. కొవిడ్‌ కారణంగా 6 నెలలు ముందుగానే ప్రభుత్వం సాయం అందించనుంది.


Next Story