81% మందిలో యూకే స్ట్రెయిన్ లక్షణాలు.. సీఎం కీలక ప్రకటన

by  |
corona virus
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే పంజాబ్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో.. టెస్టులు నిర్వహించారు. అయితే శాంపిల్స్‌లో 81% మందికి యూకే స్ట్రెయిన్ లక్షణాలున్నట్టు తేలింది. 401 మంది శాంపిల్స్‌లో 81% మంది యూకే రకం స్ట్రెయిన్ లక్షణాలు కనిపించినట్టు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వెల్లడించారు.

అయితే ఇలాంటి లక్షణాలు కనిపించిన వారిలో యువకులే ఎక్కువగా ఉన్నారని అన్నారు. అయితే వీరికి వెంటనే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రానికి టీకాలు పంపించాలని ప్రధాని మోడీని కోరనున్నట్టు సీఎం అమరీందర్ అన్నారు. పంజాబ్‌లో కరోనా బారినపడిన యువకులకు టీకా అందిచాలనే విషయం ఆలోచిస్తున్నట్టు తెలిపారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా ప్రజలు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.



Next Story