దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్‌

by  |
carona 1
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య లక్షకు దిగువనే నమోదవతుంది. ఆదివారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 80,834 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,39,989కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 3,303 మంది మరణించారు. అదే సమయంలో 1,32,062 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,70,384కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 10,26,159 యాక్టివ్ కేసులున్నాయి. అందులో కొంత మంది ఆసుపత్రిలో మరికొంత మంది హోంఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.



Next Story