- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
80శాతం రోగుల్లో లక్షణాలు లేవు: ఉద్ధవ్ థాక్రే
by Shamantha N |
<p>ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ బారిన పడ్డ రోగుల్లో 80శాతం మందికి వైరస్ లక్షణాలు కనిపించలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వెల్లడించారు. అలాగే, లాక్డౌన్ ఎత్తివేసే సున్నితమైన విషయంపై మాట్లాడుతూ.. రానున్న రెండు మూడు నెలలు చాలా ముఖ్యమైనవని అన్నారు. ఈ నెల 30 తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్న విషయాన్ని ఆదివారం సాయంత్రం సమీక్షిస్తామని తెలిపారు. అలాగే, రాష్ట్రంలో ఈ వైరస్ను పూర్తిగా అంతం చేయాల్సిన బాధ్యత మాపై ఉందని చెప్పారు. ఇది […]</p>

X
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ బారిన పడ్డ రోగుల్లో 80శాతం మందికి వైరస్ లక్షణాలు కనిపించలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వెల్లడించారు. అలాగే, లాక్డౌన్ ఎత్తివేసే సున్నితమైన విషయంపై మాట్లాడుతూ.. రానున్న రెండు మూడు నెలలు చాలా ముఖ్యమైనవని అన్నారు. ఈ నెల 30 తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్న విషయాన్ని ఆదివారం సాయంత్రం సమీక్షిస్తామని తెలిపారు. అలాగే, రాష్ట్రంలో ఈ వైరస్ను పూర్తిగా అంతం చేయాల్సిన బాధ్యత మాపై ఉందని చెప్పారు. ఇది ఓపికతో కూడిన ఆటగా అభివర్ణించారు. కాగా, దేశంలోనే అత్యధికంగా 7,628 కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదవ్వగా, వీటిలో సగానికిపైగా ముంబైలోనే వెలుగు చూసిన విషయం తెలిసిందే.
Tags: coronavirus, uddhav thackeray, asymptomatic corona patients, maharashtra, mumbai
Next Story






