వరి పొలంలో స్కూల్ యూనిఫాం.. వెళ్లి చూస్తే దారుణం

by  |
వరి పొలంలో స్కూల్ యూనిఫాం.. వెళ్లి చూస్తే దారుణం
X

దిశ, వెబ్ డెస్క్: ముక్కు పచ్చలారని బాలికపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆ బాలికను హత్య చేసిన ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీఘర్‌లోని టప్పల్ ప్రాంతంలో ఉన్న ఓ వరి పొలంలో స్థానికులకు ఓ మృతదేహం కనిపించింది. వారు వెంటనే అక్కడికి వెళ్లి చూశారు. ఆ మృతదేహం అదే ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలికగా గుర్తించారు. వెంటనే వారు తమకు సమాచారం అందించారని, ఈ విషయం తెలిసి వారు అక్కడికి చేరుకుని స్కూల్ డ్రెస్ లో ఉన్న ఆ బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించినట్లు వారు పేర్కొన్నారు.

అయితే.. ఉదయం 9 గంటల సమయంలో బాలిక పాఠశాలకు వెళ్లిందని, ఆమె ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న వరి పొలంలో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బాలిక మృతదేహాన్ని ఆమె బంధువు ఒకరు చూశారని వారు చెప్పారు. బాలిక మృతదేహం ఉన్న ప్రదేశం నుంచి 100 మీటర్ల దూరంలో రోడ్డుపై స్కూల్ బ్యాగ్ కనిపించిందని, కానీ, ఆ బాలిక స్కూల్ కు రాలేదని పాఠశాల అధికారులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Next Story

Most Viewed