షాకింగ్ : ఒకే గ్రామంలో 8 మంది మృతి

by  |
8 killed in one village
X

దిశ, వేములవాడ: కరోనా ఆ గ్రామాన్ని వెంటాడుతోంది. ఇప్పటికే ఆ గ్రామంలోని ఎనిమిది మందిని కరోనా బలితీసుకుంది. చిన్న గ్రామం అయినప్పటికీ కరోనా బారిన పడి గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. అధికారులు, పాలక వర్గం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ విజృంభన అదుపులోకి రావడం లేదు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో కరోనాతో దర్శనాల రామచంద్రం శనివారం మృతి చెందాడు. కాగా రామచంద్రం మృతితో గ్రామంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. రోజురోజుకు గ్రామంలో మృతుల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.

Next Story

Most Viewed