మంచు విష్ణు ప్యానల్‌లో 8 మంది.. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో నలుగురు గెలుపు

by  |
Manchu Vishnu panel
X

దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫైట్ దాదాపు క్లైమాక్స్‌కు చేరింది. క్షణ క్షణం ఉత్కంఠంగా సాగుతోన్న కౌంటింగ్‌తో అందరిలోనూ నరాలు తెగె టెన్షన్ మొదలైంది. ఇప్పటికే మంచు విష్ణు ప్యానల్‌లో ఎనిమిది మంది విజయం సాధించారు. మాణిక్, హరినాథ్, బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత కార్యవర్గసభ్యులుగా గెలుపొందారు. అంతేగాకుండా.. ఇప్పటివరకూ ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో నలుగురు గెలుపొందారు. అనసూయ, సురేశ్ కొండేటి, కౌశిక్, శివారెడ్డిలు కార్యవర్గ సభ్యులుగా గెలుపొందారు.

Next Story

Most Viewed