శ్రీశైలం యాత్ర మిగిల్చిన తీవ్ర విషాదం… 8మంది మృతి

by  |
nellore road accident
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరో వ్యక్తి ప్రాణాలు విడిచారు.

వీరంతా శ్రీశైలం యాత్ర ముగించుకుని నెల్లూరు తిరుగు ప్రయాణమయ్యారు. దామరమడుగు వద్దకు చేరుకోగానే మృత్యువు వారిని కబళించింది. స్వామి దర్శనం చేసుకుని సంతోషంగా తిరుగు ప్రయాణమైన వారికి ఊహించని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వారు మొత్తం 15మందితో ప్రయాణిస్తున్న టెంపో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మహిళలు, ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. మిగిలినవారు గాయాలపాలయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా వీరంతా తమిళనాడుకు చెందినవారుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed