బెంగాల్‌లో ఘోరరోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

by  |
బెంగాల్‌లో ఘోరరోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముర్షిదాబాద్‌లోని జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను ఎదురెదురుగా వచ్చిన కారు ఢీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ముర్షిదాబాద్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed