ఏపీలో అర్రులు చాస్తోన్న కరోనా

by  |
ఏపీలో అర్రులు చాస్తోన్న కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ అర్రులు చాస్తోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతుంది. దాదాపు వారంరోజుల నుంచి ఏమాత్రం తగ్గకుండా ఆరేడు వేల చొప్పున కేసులు వస్తుండటంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువవుతోంది. గడిచిన 24గంటల్లోనే 7,627 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. వైరస్ మహమ్మారి బారిన పడి ఇవాళ 56 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 1,041కి చేరింది.

రాష్ట్రంలో 48,956 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 46,301మంది డిశ్చార్జ్ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో 9మంది చనిపోగా విశాఖలో 8, కర్నూలు 6, కృష్ణా 5, చిత్తూరు 4, విజయనగరం 3, నెల్లూరు, ప్రకాశం, ప.గో. జిల్లాలో ఐదుగురు చొప్పున అనంతపురం, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున చనిపోయారు. ఏపీలో మొత్తం 16లక్షల 43వేల 319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Next Story