జనగామ జిల్లాలో మరో ఏడుగురికి కరోనా

by  |
జనగామ జిల్లాలో మరో ఏడుగురికి కరోనా
X

దిశ, జనగామ: తెలంగాణలో కరోనా వైరస్ క్రమేనా వ్యాప్తి చెందుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా ఇతర జిల్లాలో కూడా వైరస్ చేప కింద నీరుల మారుతోంది. తాజాగా జనగామ జిల్లాలో మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ.మహేందర్ తెలిపారు. మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణా యాజమానికి పాజిటివ్ రావడంతో.. అతడితో కాంటాక్ట్‌లో ఉన్న వారికి వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు



Next Story