ఏపీలో కొత్తగా 667 కరోనా పాజిటివ్‌ కేసులు

by  |
ఏపీలో కొత్తగా 667 కరోనా పాజిటివ్‌ కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో గడిచిన 24గంటల్లో 60,329మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 667మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,71,972గా ఉంది. 9మరణాలు సంభవించడంతో కరోనా మృతుల సంఖ్య 7,033కి చేరింది. ప్రస్తుతం 5,910 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,59,029మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 914మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,04,10,612 మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

అనంతపురం జిల్లాలో 37 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 105, తూర్పుగోదావరిలో 38, గుంటూరులో 114, కడపలో 24, కృష్ణాజిల్లాలో 129, కర్నూలులో 8, నెల్లూరులో 24, ప్రకాశంలో 36, శ్రీకాకుళంలో 33, విశాఖపట్నంలో 15, విజయనగరంలో 18, పశ్చిమగోదావరిలో 86 కేసులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.



Next Story

Most Viewed