- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పాట్నా: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. బీహర్లోని లఖీసరాయ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు బంధువులు మరణించారు. మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బంధువు అంత్యక్రియల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా వీరి వాహనం సిలిండర్ల ట్రక్కును ఢీకొట్టిందని చెప్పారు. ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జు అయిందని వెల్లడించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని జాముయిలోని సదర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన ఆరుగురిలో ఒకరైన లాల్జిత్ సింగ్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్కి అత్యంత సమీప బంధువు. ప్రమాదంలో లాల్జిత్తో పాటు ఇద్దరు కుమారులు, కూతురు, డ్రైవర్ చనిపోయారని వెల్లడించారు.
‘ప్రమాదంలో వాహనం తీవ్రస్థాయిలో దెబ్బతింది. మృతదేహాలను బయటకు తీయడానికి ఇనుము కట్టర్లను ఉపయోగించాం. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించాం’ అని హల్సీ సర్కిల్ ఆఫీసర్ వివేక్ కుమార్ వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.