కరోనా కోరల్లో ఆదివాసీ గూడెం.. 56 మందికి పాజిటివ్

by  |
కరోనా కోరల్లో ఆదివాసీ గూడెం.. 56 మందికి పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని ఆదివాసీ గూడెంలో కరోనా పంజా విసిరింది. ఆ తండాలో మొత్తం జనాభా 200 మంది ఉండగా, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో 56 మందికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఇటీవల రేకులగూడెం తండాలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు మహారాష్ట్ర నుంచి పలువురు హాజరయినట్లు సమాచారం. అనంతరం రేకులగూడెంలో పలువురికి కరోనా లక్షణాలు కనిపించగా, టెస్టుల నిర్వహణ తర్వాత 56 మందికి పాజిటివ్ రావడం తండా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

Next Story

Most Viewed