గుడ్‌న్యూస్.. త్వరలో ఆక్సిజన్ ప్లాంట్లు

by  |
గుడ్‌న్యూస్.. త్వరలో ఆక్సిజన్ ప్లాంట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అతిత్వరలోనే దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. పీఎం కేర్ నిధుల నుంచి ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద కొత్త ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటును అతి త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటు అనంతరం నిరంతరం ఆక్సిజన్ సరఫరా అయ్యేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు మోడీ వెల్లడించారు.

Next Story

Most Viewed