54 మంది అభ్యర్థులు ఔట్​

by  |
54 మంది అభ్యర్థులు ఔట్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్​– రంగారెడ్డి – మహబూబ్​ నగర్​ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపులో భాగంగా ఇప్పటి వరకూ 54 మంది అభ్యర్థులను ఎలిమినేట్ ​చేశారు. వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలిన 43 మంది అభ్యర్థులకు పంచారు. ఎలిమినేషన్​అభ్యర్థుల ఓట్లలో బీజేపీకి 283, టీఆర్‌ఎస్‌కు 306, నాగేశ్వర్‌కు 205, కాంగ్రెస్‌కు 151 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల కేటాయింపు తర్వాత కూడా టీఆర్‌ఎస్​ అభ్యర్థి వాణిదేవి 1,12,995 ఓట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్​ రావు 1,04,951 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు (రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి)..

బీజేపీ –1,04,951
టీఆర్ఎస్​–1,12,995
నాగేశ్వర్​ –53,815
కాంగ్రెస్​– 31,705.

Next Story