మద్యం ఆదాయంలో 50 శాతం మాకే కేటాయించాలి: నాగేశ్వరరావు

by  |
adhayam-1
X

దిశ, ములకలపల్లి: మద్యం ఆదాయంలో 50 శాతం గౌడ సంక్షేమానికి కేటాయించాలని గౌడ్ సంఘం నాయకులు ఆకుల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జగన్నాథపురం, నర్సాపురం గ్రామాల పరిధిలో ఉన్న గౌడ సామాజిక వర్గం కార్తీక మాసంలో కోటెమ్మ గుడి ఆవరణలో వన సమారాధన జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అందరూ తమ తమ పిల్లల్ని ఉన్నతంగా చదివించాలని కోరారు. లిక్కర్ గ్రామాల్లోకి వచ్చాక గౌడ్ కుల వృత్తి దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రెడ్డిమల్ల వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోతుగంటి క్రాంతి, పామర్తి పూర్ణ చందరవు, ప్రసాద్, పామర్తి వెంకటేశ్వరరావు, పోతుగంటి లక్ష్మణ్, బజ్జూరి నాగేశ్వరరావు, సురభి రాజేష్, గాదెగోని వెంకటేశ్వర్లు, మరీదు నాగు పాల్గొన్నారు.



Next Story