కామారెడ్డిలో ఐదు శాంపిల్స్ నెగెటివ్

by  |

దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాకు చెందిన ఐదుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చిందని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భిక్కనూర్‌కు చెందిన నలుగురు, పెద్ద కొడప్గల్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి శాంపిల్స్‌ను సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపించారు. పరీక్షల్లో వారికి నెగెటివ్ వచ్చింది. ఇందుకు సంబంధించిన రిపోర్ట్స్ అందాయని, కామారెడ్డి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రశేఖర్ తెలిపారు.

tags: 5 members got corona negative, lockdown, kamareddy, district medical officer

Next Story

Most Viewed