ఇబ్రహీంపట్నం పరిధిలో ఐదుగురికి కరోనా

by  |
ఇబ్రహీంపట్నం పరిధిలో ఐదుగురికి కరోనా
X

దిశ, ఇబ్రహీంపట్నం: తెలంగాణలో జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు తాజాగా గ్రామాల్లోకి పాకుతున్నాయి. తాజాగా, గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఒకే రోజు ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన ఒకరికి, యాచారం మండలం నక్కగుట్ట తండాలో ఇద్దరు, తక్కళ్లపల్లి తండాకు చెందిన మరో ఇద్దరికి వైరస్ సోకిందని అధికారులు వెల్లడించారు.

Next Story