- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : కొవిడ్ ఆస్పత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. ఇటీవల ఏపీ, మహారాష్ట్రలలో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవించిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినా ఆస్పత్రి యాజమాన్యాలు చేతులు దులిపేసుకుంటున్నాయి. ఆ తర్వాత వాటిపై చర్యలు తీసుకున్న ఘటనలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఓ వైపు కొవిడ్ బారిన పడి చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడుతామనుకునే లోపే ఆస్పత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు రోగుల ప్రాణాలు తీస్తున్నాయి.
తాజాగా నాగ్పూర్లోని కొవిడ్ ఆస్పత్రిలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు రోగులు మృతి చెందగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 27మందిని ఇతర ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.