కుక్కల దాడిలో 48 గొర్రెలు మృతి

by  |
కుక్కల దాడిలో 48 గొర్రెలు మృతి
X

దిశ, అమనగల్లు: కుక్కల దాడిలో 48 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అమనగల్లు మండల పరిధిలో చోటు చేసుకుంది. మేడిగడ్డకు చెందిన జుక అనే మహిళ.. తన పొలంలో గొర్రెలను కట్టేసి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున షెడ్ వద్ద కుక్కల దాడిలో 48 గొర్రెలె మృతి చెందారు. మరో 12 గొర్రెలు గాయపడ్డాయి. సుమారు ఏడు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని జుక వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు జుక విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed