కళ్యాణలక్ష్మికి రూ.462.50 కోట్లు

by  |
కళ్యాణలక్ష్మికి రూ.462.50 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. అర్హులందరికీ ఆర్థికసాయం అందజేస్తుంది. నిధులు మంజూరు కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కల్యాణ లక్ష్మి పథకానికి రూ.462.50 కోట్లు, షాదీ ముబారక్ పథకానికి రూ.150 కోట్లు విడుదలయ్యాయి. మైనార్టీల సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అహ్మద్ నదీమ్, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు చెక్కులను త్వరలోనే అందజేయనున్నారు.



Next Story