పోటెత్తిన ఓటర్లు.. భారీ పోలింగ్ దిశగా హుజురాబాద్

by  |
Huzurabad polling
X

దిశ, డైనమిక్ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ వేగంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మొదట్లో ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ కాస్త ఆలస్యం అయింది. ఈ సందర్భంగా భారీగా తరలివస్తున్న ఓటర్లతో పోలింగ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ మొదలైన ఆరు గంటల్లో 45.63 శాతం పోలింగ్ జరిగినట్లు ఈసీ తెలిపింది. ఈ క్రమంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొత్తం 1,08,082 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.


Next Story

Most Viewed