భారత్‎లో కరోనా విజృంభణ..!

by  |
భారత్‎లో కరోనా విజృంభణ..!
X

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 45,576 క‌రోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే 585 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 89,58,484కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,31,578 మంది మృతి చెందారు. ఇక ప్రస్తుతం యాక్టివ్‎గా 4,43,303 కేసులు ఉండ‌గా.. కరోనా నుంచి కోలుకుని 83,83,603 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 10,28,203 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.

Next Story

Most Viewed