సీఐడీ వద్ద 450 పెండింగ్ కేసులు.. గవర్నర్‌కు పద్మనాభరెడ్డి లేఖ

by  |
సీఐడీ వద్ద 450 పెండింగ్ కేసులు.. గవర్నర్‌కు పద్మనాభరెడ్డి లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్‌కు సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. సహచట్టం ద్వారా సీఐడీలోని కేసుల వివరాలు సేకరించామని ఆయన లేఖలో పేర్కొన్నారు. దాదాపుగా ఆ కేసులు పదేండ్లుగా దర్యాప్తు దశలోనే ఉన్నాయని చెప్పారు. 2014 నాటికి సీఐడీ వద్ద 242 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 450 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇరుకునపడే కేసు వస్తే సీఐడీకి బదిలీ చేస్తున్నారని అన్నారు. సీఐడీ పనితీరు మెరుగయ్యేలా సీఎస్‌‌కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.


Next Story

Most Viewed