ఒక్కరోజే 445 మరణాలు

by  |
ఒక్కరోజే 445 మరణాలు
X

భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరణాల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 445 మంది కరోనా నుంచి కోలుకోలేక మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,699కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 14,821 కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 4,25,282కు చేరింది. ప్రస్తుతం భారత్‌లో రికవరీ శాతం 55.77 గా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,37,196 మందికి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రపంచంలో కరోనా టాప్ టెన్ దేశాల్లో భారత్ నాలుగో ప్లేస్ లో ఉంది.

Next Story

Most Viewed