భారత్‎లో విజృంభిస్తున్న కరోనా

by  |
india corona cases
X

దిశ, వెబ్ డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో తాజాగా 44,376 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 481 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 92,22,217కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,34,699 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ గా 4,44,746 కేసులు ఉండగా.. కోవిడ్‌ నుంచి కోలుకుని 86,42,771 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


Next Story

Most Viewed