దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే ?

by  |
carona 1
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బుటిటెన్ ప్రకారం .. గడిచిన 24 గంటల్లో దేశంలో 43,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,45,433 చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 955 మంది మరణించగా అదే సమయంలో 52,299 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో ఇప్పటివరకు 2,96,58,078 మంది కరోనాను జయించగా, మరణాల సంఖ్య 4,02,005కు పెరిగింది. ఇక దేశంలో ప్రస్తుతం 4,85,350 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.



Next Story