24 గంటల్లో 43 కరోనా కేసులు: కేంద్రం

by  |
24 గంటల్లో 43 కరోనా కేసులు: కేంద్రం
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 43 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో కరోనా కేసులు 649 చేరాయని తెలిపింది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజు సరాసరి 70 నుంచి 80 కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నేడు ఈ సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. కాగా, ఈ 24 గంటల్లో ముగ్గురు కరోనా కారణంగా మృతి చెందారని వివరించింది. అయితే ఈ తగ్గుదల చూసి నిర్లక్ష్యం వహించకూడదని ఆరోగ్యశాఖకు చెందిన అధికారి తెలిపారు. కాగా మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం దేశంలో కరోనా కేసులు 656 దాటినట్టు తెలుస్తోంది. అలాగే కరోనా మృతుల సంఖ్య కూడా 17 నమోదైనట్టు సమాచారం.

Tags : Coronavirus, india, cases, fatalities, death toll


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed