భారత్‎లో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..?

by  |
భారత్‎లో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..?
X

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో గత 24 గంటల్లో కొత్తగా 41,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 496 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 93,92,920కి చేరింది. ఇప్పటివరకు 1,36,696 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 4,53,956 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 88,02,267 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 13,95,03,803 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


Next Story