బిగ్‌ బ్రేకింగ్.. నలుగురిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

by  |
బిగ్‌ బ్రేకింగ్.. నలుగురిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్ రాకేష్ సింగ్‌ను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే మావోయిస్టులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలో నలుగురిని కిడ్నాప్ చేశారు. మిటానిన్ మాస్టర్ ట్రైనర్‌తో సహా ముగ్గురు మహిళలను కిడ్నాప్ చేశారు.

బీజాపూర్ జిల్లా గంగళూరు పోలీస్టేషన్ పరిధిలోని కామకనార్ ప్రాంతం నుండి మావోయిస్టులు నలుగురిని ఎత్తుకెళ్లారు. కిడ్నాప్‌కు గురైన వారిలో మిటానిన్ మాస్టర్ ట్రైనర్ (హెల్త్ వర్కర్స్ ట్రెయినర్), మరో ముగ్గురు మహిళా హెల్త్ వర్కర్స్ ఉన్నారు. అయితే, వారిని ఎందుకు కిడ్నాప్ చేశారన్న విషయంపై మావోయిస్టులు మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.



Next Story

Most Viewed