ఘోర ప్రమాదం: నలుగురు స్పాట్ డెడ్ 

by  |
ఘోర ప్రమాదం: నలుగురు స్పాట్ డెడ్ 
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్, ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలవగా… చికిత్స నిమిత్తం వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కాగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులంతా కాట్ని ప్రాంతానికి చెందినవారిగా తెలుస్తోంది. వీరంతా కూలి పని కోసం నీముచ్ ప్రాంతానికి వ్యాన్ లో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ట్రక్కును సీజ్ చేశారు.


Next Story

Most Viewed