బెల్లంపల్లిలో నలుగురికి కరోనా పాజిటివ్

by  |
బెల్లంపల్లిలో నలుగురికి కరోనా పాజిటివ్
X

దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ పరిధిలోని నలుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో పట్టణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ సోకిన వారిలో ఒకరు ఏఆర్ కానిస్టేబుల్, మాజీ వార్డు కౌన్సిలర్, వారితో పాటు మరో ఇద్దరికీ కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వ్యాధి సంక్రమించిన వారితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నటువంటి వ్యక్తుల సమాచారంతో పాటు, కుటుంబీకుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్‌కు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed