MRO ఆఫీసులో ముగ్గురికి కరోనా..

by  |
MRO ఆఫీసులో ముగ్గురికి కరోనా..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో విధులకు హాజరై కరోనా బారిన పడుతున్న ప్రభుత్వ అధికారుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

తాజాగా మరో ముగ్గురు ప్రభుత్వ అధికారులు కరోనా బారిన పడ్డారు. నాగర్ కర్నూల్ తహసీల్దార్ కార్యాలయంలో ముగ్గురు ఉద్యోగస్తులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో మండల ప్రజలు ఎవరూ కార్యాలయాలకి రావొద్దని, అత్యవసరం ఉంటే ఫోన్‌లోనే సంప్రదించాలని, ఎమ్మార్వో గోపాల్ ప్రజలకు సూచించారు.

Next Story

Most Viewed