- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఖమ్మం :
మావోయిస్టులకు నగదు చేరవేస్తున్న ముగ్గురు వ్యక్తులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన గురువారం మధ్యాహ్నం మండలంలోని నల్లబెల్లి వద్ద చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు నల్లబెల్లి వద్ద పోలీసుల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి రూ.6లక్షల వసూలు చేసి కారులో తీసుకెళ్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో భద్రాచలం అటవీశాఖ బీట్ ఆఫీసర్ మరకం వీరేందర్ కూడా ఉండటం గమనార్హం. ఆయనతో పాటు పాల్వంచకు చెందిన బండి వెంకటేశ్వర్లు, ఆలపాటి ప్రసాద్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.నిందితుల నుంచి రూ.6లక్షలు, కారు, ద్విచక్రవాహనం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Next Story