పండుగలకు 39 ప్రత్యేక రైళ్లు..

by  |
పండుగలకు 39 ప్రత్యేక రైళ్లు..
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా దెబ్బకు రైళ్ల రాకపోకలపై నిషేధం కొనసాగుతుండగా, త్వరలో రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా పలు రైళ్లను నడిపించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. దసరా, దీపావళి పండుగలకు ప్రతి ఏడాది ఉండే రద్దీ దృష్ట్యా 39 రైళ్లను నడిపించేందుకు ఆ శాఖ నిర్ణయించింది.

ఆయా రైల్వే జోన్ల నుంచి వచ్చే వినతుల ప్రకారం సాధ్యమైనంత త్వరగా రైళ్లను నడిపిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే, కొత్తగా నడపబోయే ఈ రైళ్ల టైమింగ్స్‌, బుకింగ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని రైల్వేశాఖ తెలిపింది.



Next Story

Most Viewed