తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా

by  |
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో తాజాగా 384 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,78,108 కి చేరింది. ఇప్పటివరకు కరోనా కారణంగా 1,496 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 7,380 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,69,232 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 61,64,661 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.



Next Story

Most Viewed