సాధారణ స్థితి తెచ్చేందుకు చర్యలు !

by  |
సాధారణ స్థితి తెచ్చేందుకు చర్యలు !
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో భారీ వర్షంతో వరద ప్రభావానికి గురైన ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. వరద ప్రభావంతో 37,409 కుటుంబాలు ముంపు బారిన పడ్డాయని తెలిపారు. గుర్రం చెరువుకు భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నందున 2,100 ఫ్యామిలీలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. ప్రస్తుతం జలదిగ్భందంలో ఉన్న ప్రాంతాల్లో రూ.2,800 విలువైన వస్తువులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 20వేల రేషన్ కిట్స్, బ్లాంకెట్లు పంపిణీ చేశామన్నారు.


Next Story

Most Viewed